విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై పట్టణ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి దిశా నిర్దేశం
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం పట్టణ ట్రాఫిక్ పై సీఐ దుర్గా శేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు..
1. అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరే కాకినాడ నాన్ స్టాప్ నేరుగా సావరం బైపాస్ రోడ్డు నుంచి ఎర్రవంతెన కు చేరుకుంటుంది.
2. కాకినాడ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఎర్రమంతుని మీద ఆగకుండా డిగ్రీ కళాశాల ప్రాంతంలో ఆగాలని సి ఐ ఆదేశాలు జారీ చేశారు. మరో స్టాప్ గా ఉన్న విక్టరీ బజార్ వద్ద కాకుండా గుర్రాల స్టాండ్ వద్ద నిలుపుదల చేయాలన్నారు.
3. ముమ్మిడివరం గేట్ నుంచి గడియార స్తంభం వచ్చే ఫోర్ వీల్ త్రీ వీల్ వాహనాలను పూర్తిగా కట్టడి చేస్తామని సీఐ తెలిపారు. వారందరూ గొల్లగూడెం బైపాస్ రోడ్డు మీదుగా గడియార స్తంభం చేరుకోవాలని శేఖర్ రెడ్డి అన్నారు.