విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రాపురం:
డ్రోన్ ఫ్లై సర్వే పనులు పరిశీలించిన ఆర్డిఓ సింధు సుబ్రహ్మణ్యం……
కపిలేశ్వరపురం విశ్వం వాయిస్ టేకి గ్రామంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు పథకంలో భాగంగా డ్రోన్ ఫ్లై సర్వీసును ఆర్ డి ఓ సిందు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. త్వరితగతిన భూ సర్వే పనులు పూర్తి చెయ్యాలని సంభదిత సర్వే అధికారులను ఆర్ డి ఓ ఆదేశించారు.కపిలేశ్వరపురం మండలం లో గల 15రెవెన్యూ గ్రామాలలో 10 గ్రామాలు సర్వే పూర్తయిందని తహశీల్దార్ కొమరం సూర్య రావు తెలిపారు. మిగిలిన 5గ్రామాలలో రీ సర్వే పనులు జరుగుతున్నాయి అన్నారు. ఆకాశం మేఘావృతం గా వుంటే డ్రోన్ ఫ్లై సర్వే పనులకు ఆటంకం కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేడిశెట్టి దుర్గారావు,సర్పంచ్ కుక్కల నాగమణి, డి టి శ్రీ రామ్, మండల సర్వేయర్ నాగేశ్వర రావు, వి ఆర్ ఓ మల్లేష్ , రైతులు పాల్గొన్నారు.