విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది పురస్కరించుకొని శ్రీ రామానంద చారిటబుల్ ట్రస్ట్ అమలాపురం వారి ఆధ్వర్యంలో సుబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద కీ.శే బ్రహ్మశ్రీ కోసూరి సూర్యనారాయణాచారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బ్రహ్మశ్రీ కోసూరి చిదంబరాచారి విశ్వకర్మ(చిన్న),కల్యాణి దంపతుల ఆర్థిక సహాయంతో చలివేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు కట్టోజు సన్నాయి దాసు, జిల్లా ప్రధానకార్యదర్శి అవుపాటి వేణు గోపాల్ ప్రారంభించారు. అమ్మవారి దర్శనం కొరకై వచ్చిన భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు గంగా నాగేశ్వరరావు, పట్నాల వెంకటరమణ మల్లికార్జునరావు, దాకోజు భీముడు, మెట్ల రమణబాబు, అల్లాడ సోంబాబు నల్లా స్వామి నాయుడు, బోణంసత్య వరప్రసాద్ రేకపల్లి సూరిబాబు, చింతలపూడి సత్తిబాబు, వాసిరెడ్డి ఈసు, లక్కోజు వరప్రసాద్,తాళాబత్తుల లక్ష్మణరావు, తాళాబత్తుల వెంకటేశ్వరరావు(కొండ), తాళాబత్తుల నాగు, ఓడూరి సాయికిరణ్, ఓడూరి ఫణీంద్ర కుమార్, బోల్లోజు మణి శ్రీకాంత్, కోసూరి దుర్గా కుమారాచారి, కర్రీ నారాయణరావు, దోసూరి శివ, వరద శివ, సారంపాటి నాని, లు తదితరులు పాల్గొన్నారు.