విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*కలెక్టరేట్ నందు ఘనంగా శోభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు*
అమలాపురం విశ్వం వాయిస్ మార్చి 22:
శోభ కృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా స్థానిక కలెక్టరేట్ నందు బుధవారం మొదటిగా శ్రీ లక్ష్మీ గణపతి సన్నాయి బృందం మానేపల్లి చిన వెంకటేశ్వరరావు వారిచే ఉగాది మహోత్సవ శుభ మంగళ నాదస్వరం ఆలపించారు. అనంతరం అతిధులచే జ్యోతి ప్రజ్వలన గావించి గణపతి పూజతో వేడుకలను ఘనంగా ప్రారంభించా రు. తదుపరి కప్పగంతుల సూర్యనారాయణ, శ్రీ తేజోమూర్తుల అచ్యుత నాగేంద్ర శర్మ వార్లచే వేద పఠనం మహాదాశీర్వచన కార్య క్రమం నిర్వహించారు. అనంతరం
పంచాంగ శ్రవణo కార్యక్రమాన్ని పెట్టింటి సాయి దీక్షితులు వారిచే నిర్వహించారు.కవి సమ్మేళనం
కార్యక్రమాన్ని ఎం ఈ కే భీమారావు
డాక్టర్ ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి,
దొండపాటి నాగజ్యోతి, మొంగం అమృత రావు జాన దుర్గా మల్లికార్జునరావు డాక్టర్ కేటీ పద్మజ వార్లచే ఘనంగా నిర్వహించి అనంతరం కార్యక్ర మంలో పాల్గొన్న వేద పండితులను కవులను ఘనంగా జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా సన్మానించారు