విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచుమర్తి అనురాధకు శుభాకాంక్షలు తెలిపిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి జగన్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత బయట పెట్టగా నేడు వైసిపి సొంత పార్టీ నుండే వ్యతిరేక స్పష్టమైనది అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినది మొదలు ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల నుండే కాకుండా నేడు సొంత పార్టీ నేతలు నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరే అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.