అమరవీరులకు ఘన నివాళి
తాళ్ళరేవులోని ప్రజాసంఘాల కార్యాలయంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
అమరవీరులకు ఘన నివాళి
భారత స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవులోని స్థానిక ప్రజాసంఘాల భవనంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె ఎస్ శ్రీనివాస్, వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు.