విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
పెళ్లిళ్ల వెంకన్న కల్యాణోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
పినిపె విశ్వరూప్ ను కలసి మొదటి ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ చైర్పర్సన్ విరీతా దేవి ఫణి
అమలాపురంవిశ్వం వాయిస్ న్యూస్
శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈనెల 28నుండి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈవేడుకల్లో పాల్గొనవలసిందిగా గురువారం అమరావతిలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ను కలిసి మొదటి ఆహ్వానపత్రికను అందచేసిన ఆలయ చైర్ పర్సన్ దూడల విరీతదేవిఫణి అనంతరం ఉత్సవాల పోస్టర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మార్చి నెల 28వ తేదీన స్వామివారిని పెళ్లి కుమారుడిని చేయడంతో మొదలయ్యే కల్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 8న శ్రీ తెప్పోత్సవం వరకూ 12 రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ చైర్పెర్సన్ దూడల విరీతదేవిఫణి తెలిపారు. కొత్త పాలకవర్గం ఈ ఉత్సవాలను అత్యంత ప్రతీస్టాత్మకంగా తీసుకుని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు దూడల ఫణి ట్రస్ట్ బోర్డు సభ్యుడు నడింపల్లివర్మ పాల్గొన్నారు.