ఎం డి యు డబ్ల్యూ ఏ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్లరేవులోని స్థానిక అంబేద్కర్ భవన్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పివి రావుల విగ్రహాలకు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కోరంగి గ్రామానికి చెందిన వెంటపల్లి చంద్రమౌళి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పివి రావు జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు మన దళిత జాతికి అంకితం చేస్తూ ఆయనే ఆయనను గుర్తు చేసుకుని జయంతి కార్యక్రమం నిర్వహించినట్లు చంద్రమౌళి మాట్లాడారు. మండల నలుమూలల నుండి వచ్చిన ఎస్సీ నాయకులు ప్రతినిధులు పూలమాలలు వేసి పివి రావుకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దున్న జనార్దన్ రావు, జక్కల ప్రసాద్ బాబు, సాధనాల వెంకట శివరామకృష్ణ ,ఊడా వెంకట రామకృష్ణ, లక్ష్మణస్వామి, జగదీశ్వరరావు, అప్పారావులు పాల్గొని నివాళులర్పించారు.