తాళ్లరేవులో తెలుగుదేశం నాయకులు వాడ్రేవు వీరబాబు విమర్శలు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు వీరబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగు సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తున్నారని అన్నారు. బిసి సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చాలా మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి, ఆ సలహాదారులు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, జిల్లా తెలుగుదేశం నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మిరామలక్ష్మి ఉన్నారు.