విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
భారతీయ జనతా పార్టీ రూరల్ మండల సమావేశం
ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు
రూరల్ మండల అధ్యక్షులు గుమ్మల్ల రెడ్డి నాయుడు అధ్యక్షతన
ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ ఇంటి వద్ద
అమలాపురం రూరల్ మండలం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రూరల్ మండల సమావేశం ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ ఇంటివద్ద నందు జరిగింది
రూరల్ అధ్యక్షులు గుమ్మల రెడ్డి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి Dr BR అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు ముఖ్య అతిది రావడం జరిగింది
మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 25లక్షలు ఇల్లు రాష్ట్రానికి కేటాయిస్తే పేదల ఇళ్ల నిర్మాణా నికి వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు పెడుతుందని అన్నారు తక్షణమే ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర నిధులు పేదలకు సబ్సిడీ కింద ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిధులతో మండపేట ద్వారపూడి రోడ్డు అసంపూర్తిగా ఉండడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి డబ్బులను వెంటనే చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది
రాష్ట్రంలో ఉన్న వైసిపి, తెలుగుదేశం కుటుంబ పార్టీలను పారద్రోలే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని , వైసిపికి మద్దతు ఇస్తున్నట్లు తెలుగుదేశం, వైసీపీ పార్టీలే దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రపతి ముర్ముపై ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆమెపై పోటీ పెట్టి ఓడించాలని సూచాయని ఆ ప్రతిపక్ష పార్టీలే పార్లమెంటు భవనం రాష్ట్రపతి ముర్ముచేత ప్రారంభోత్సవం చేయించడం లేదని గగ్గోలు పెడుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల మే 30వ తేదీ నుండి జూన్ 30వ తేది వరకు ప్రధాని మోడీ 9 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్బంగా పార్టీ కార్యక్రమాలు పట్టణంలో లో ప్రతి వార్డు ప్రతి ఇంటికి మోదీ సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ ద్వారా ప్రజలకు తెలియచేసే బాధ్యత బిజెపి నాయకులు, కార్యకర్తలు తీసుకొని పార్టీ ని బలోపేతం చెయ్యాలని సూ చించారు,
బూత్ కమీటీలు,శక్తికేంద్రాలు బలంతో బీజేపీ ని బలోపేతం చేయాలి అని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పట్టణ మరియు మండలాల బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఒక్కొక్క బూత్లో 11 మందిసభ్యుల ఉండేటట్లు కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని అన్నారు.బీజేపీ లో సభ్యత్వం తీసుకోవడానికి అనేకమంది ముందుకొచ్ఛి ఉత్సాహం చూపుతున్నారంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న సుపరిపాలనే కారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ నంద్యాల రామారావు మట్టపర్తి వెంకటేశ్వరరావు ఎం శ్రీరామ్ బొంతు వెంకటరమణ తలాటం బాలాజీ డేగల రాజు మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు