రోడ్ ప్రమాదం. ముగ్గురుకి గాయాలు
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం-కాకినాడ ప్రధాన రహదారిలో కభేలా సమీపంలో బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కి సమాచారం అందించగా, క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకులు ఉలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
రోటరీ క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-సమాజానికి సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి సత్యం పేర్కొన్నారు.ఆదివారం అన్నయిపేట గ్రామంలో కాకినాడ రోటరీ క్లబ్ సౌజన్యంతో అన్నయపేట పంచాయతీ నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ (జల కళ్యాణం) ప్రారంభోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ పెమ్మిరెడ్డి దొరబాబు,ముఖ్య అతిథులుగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, రోటరీ అధ్యక్షులు తడాలబుజ్జి రోటరీ సెక్రెటరీ సతీష్ లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో సత్యం మాట్లాడుతూ...
సంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రానికి మణిహారం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
సంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రానికి మణిహారం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-అంకెలు ఆత్మానందాన్ని, ఉత్సాహమును ఇస్తాయని సౌందర్యా అన్వేషణ,హేతువాదానికి గణితమే అందమని గణిత సేవా సంస్థ రామానుజన్ గణిత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కే వి వి సత్యనారాయణ అన్నారు. రామానుజన్ గణిత అకాడమీలో సంఖ్యా శాస్త్రంపై జరిగిన సెమినార్ కు అధ్యక్షత వహించారు మరియు ఆయన ప్రసంగిస్తూ గణిత శాస్త్రం మేదో సంబంధమైన కళ అని. అంకెల మధ్య ఉన్న లయ, క్షేత్రగణిత ఆకారాల మధ్య గల శృతి సోయగాలు గణిత వేత్తలకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని అందుచేతనే న నిరంతరము గణిత పరిశోధకలు జరుగుతున్నాయన్నారు....
ఉద్యమాలు అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెడతాం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం నియోజకవర్గం బిసివై పార్టీ ఇంచార్జ్ బర్ల.శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టనీయకుండా భారతచైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ను పోలీసులు అడ్డుకున్న తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు.అలానే భారతరాజ్యంగం ప్రసాదించిన సంచార స్వాతంత్ర్యానికి విరుద్ధంగా వ్యవహరించి,పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.గత ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలపై ఇదే తీరున ప్రవర్తించి హోదాలేని ప్రతిపక్షంగా మారిపోయిందని ఆయన గుర్తుచేశారు.అధికారం అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అడ్డుకోలేరని, ప్రజాసమస్యలు ఉన్నంతకాలం పోరాటం చేస్తూనే ఉంటామని మా గొంతులు నొక్కలనీ చూస్తే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకోవలసి...
బాబు మోసాలు ప్రజలోకి తీసుకెళ్తున్నాం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
బాబు మోసాలు ప్రజలోకి తీసుకెళ్తున్నాం
పిల్లి సూర్యప్రకాష్
రామచంద్రాపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురంలో 19,20 వ వార్డ్ లలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జి మరియు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికలముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోయారని,అందుకే ప్రజలు తెలుసుకునేలా
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, మోసపూరిత హామీలను నియోజకవర్గంలో గ్రామాలలో ప్రజలకు వివరించడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఉందని,వచ్చేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని,మళ్ళీ...
కొలంక కేశవస్వామికి వెండి కవచం బహుకరణ
రూ 7లక్షల విలువ చేసే వెండి కవచం అందజేత
విశ్వం వాయిస్ న్యూస్, కొలంక
కాజులూరు మండలం కోలంక గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ కేశవస్వామి వారికి క్షత్రియ పరిషత్ సభ్యులు వెండి కవచం బహుకరించారు. ఈమేరకు శనివారం 7 లక్షల రూపాయలు విలువచేసే వెండి కవచాన్ని ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో దంతులూరి వెంకట విజయ గోపాలకృష్ణంరాజు కృష్ణవేణి దంపతులచే సంప్రోక్షణ అనంతరం ఆలయ అర్చకులకు అందజేశారు. దంతులూరి కుటుంబీకులైన సాధు కృష్ణ వర్మ, వెంకట సత్యనారాయణ రాజు, వెంకట నరసింహారాజు, విశ్వనాథ వెంకటకేశవరాజు, కృష్ణ వర్మ, వెంకటరాఘవరాజు, సుబ్బరాజు, వెంకటతిరుపతిరాజు ఆర్థిక సహకారంతో సంయుక్తంగా స్వామి వారికి అందజేశారు. ఈ సందర్భంగా సాదు కృష్ణవర్మ మాట్లాడుతూ...
సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం
విశ్వం వాయిస్ న్యూస్, కాజులూరు
టీడీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని గుర్తించి పరిష్కరించడం జరిగితుందని కాజులూరు మండల టీడీపీ అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి(డాక్టర్ బాబు) పేర్కొన్నారు. మండల కేంద్రమైన కాజులూరులో ఈమేరకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేసి ఏడాది పాలనపై ప్రజాభిప్రాయల్ని, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ (పెద్ద), టీడీపీ నాయకులు ఎలుగుబంట్ల శ్రీనివాస్, యాళ్ల దొరబాబు, వాసంశెట్టి సూరిబాబు, బొండాడ మణికంఠ, వాసంశెట్టి నారాయణరావుపాల్గొన్నారు.
రాకుర్తి వారి పాలెం సొసైటీ అధ్యక్షులుగా బొక్కా వెంకట కుమార్*
విశ్వం వాయిస్ న్యూస్, కొత్తపేట
కొత్తపేట జులై 26.విశ్వం వాయిస్ న్యూస్. కొత్తపేట రాకుర్తివారి పాలెం కొత్తపేట మండలం మోడెకూరు పంచాయతీ పరిధిలోని రాకుర్తి వారి పాలెం సొసైటీ అధ్యక్షులుగా బొక్కా వెంకట కుమార్ రాకూర్తివారి పాలెం సొసైటీ కార్యాలయం వద్ద బాధ్యతలు స్వీకరించారు.
గతంలో గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన బొక్క వెంకట కుమార్ గత పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.బొక్క వెంకట కుమార్ పై ఉన్న సానుకూలత భావంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుమార్ ను సొసైటీ అధ్యక్షులుగా ఎంపిక చేశారు.గొలకోటి సూర్యనారాయణ (ఏసు) గన్నవరపు చిన్న జోజి లను సొసైటీ...
వాడపల్లి వెంకన్న శనివారం ఆదాయం
విశ్వం వాయిస్ న్యూస్, వాడపల్లి
కొత్తపేట ఆత్రేయపురం జూలై 26.విశ్వం వాయిస్ న్యూస్. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం శనివారం శ్రీ స్వామి వారి సన్నిధిలో ఆదాయ వివరములు ప్రత్యేక దర్శనం (50/-) టిక్కెట్లు 21374 విశిష్ట దర్శనం (200/-) టిక్కెట్లు 5486
వేద ఆశీర్వచనం (1,116/-) టిక్కెట్లు 1484 సుప్రభాతం దర్శనం టికెట్లు 100 తులాభారం టిక్కెట్లు 4
కళ్యాణ కట్ట టిక్కెట్లు 501
లడ్డు ప్రసాదం విక్రయిం 48515 పులిహోర ప్రసాదం విక్రయిం 28231 నిత్య అన్నదాన కార్యక్రమం నిమిత్తం 2,30,752/- లు శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం 98,265/-లు ఇతర విరాళం ద్వారా 1,485/- లు లడ్డూ కవర్లు విక్రయిం ద్వారా 7,005/-ప్రత్యేక...
ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి
వేమగిరిలో బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు
విశ్వం వాయిస్ న్యూస్, కడియం
కడియం మండలం వేమగిరి లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్స్ ఎడ్యుకేషన్,అవేర్నెస్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం ఎ. మహాన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని, పి.ఎమ్ జన్ధన్ ఖాతాలు, రూపే ఏటీఎం కార్డు, నామినేషన్ సౌకర్యాలు కలిగి ఉందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ...