20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
76 ARTICLES

Ch johnRATNAM

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

ఘనంగా ఎస్ మార్కెటచ్ గ్లోబల్ డిజిటల్ మార్కెట్ సీఈవో సుమంత్ పుట్టినరోజు వేడుక

అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నల్ల వంతెన దిగువన గల ఎస్ మార్కెటచ్ గ్లోబల్ డిజిటల్ మార్కెట్ సీఈఓ సాదె సుమంత్ పుట్టినరోజు వేడుకలు ఆఫీసు వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోనసీమ కేర్ హాస్పిటల్ ఎండి కారెం రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆఫీస్ స్టాఫ్, స్నేహితులు బంధుమిత్రులు మధ్య సుమంతచ భారీ కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా రవితేజ సుమంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నవయసులోనే జిల్లాలో గ్లోబల్ మార్కెట్ ద్వారా మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్న సుమంత్ ని అభినందిస్తూ ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది తెలుగు రాష్ట్రాలలో బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోని ఇలాంటి...

పితాని ఖబర్దార్ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం

అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను విమర్శించే స్థాయి పితాని బాలకృష్ణ కు లేదని అమలాపురం శెట్టిబలిజ సంఘ నాయకులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిష్మా ఉన్న యువ నాయకుడు మంత్రి సుభాష్ ను విమర్శించే స్థాయా నీది..? అంటూ ప్రశ్నించారు. మంత్రి సుభాష్ శెట్టిబలిజ కులానికి, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పేద విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వ పరంగానే...

వైసిపి పాలనలోనే శెట్టిబలిజ గౌడ కుల జీవో ఉత్తర్వులు ఇచ్చారు గుత్తుల సాయి

ముమ్మడివరం శెట్టిబలిజ కులం సర్టిఫికెట్లు జీవో జారీ పట్ల హర్షం.- మంత్రి సుభాష్ కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు   శెట్టిబలిజ కులస్తులకు శెట్టిబలిజ బీసీ బి సీరియల్ నెంబర్ -4 గా కులం సర్టిఫికెట్లు యధావిధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 6 ను జారీ చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సీనియర్ నాయకులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకట సాయి అధ్యక్షతన నాయకులు కాట్రేనికోనలో సమావేశమై జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి శుభాష్ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు...

సైలెన్సర్లు తీసి బైక్ నడిపిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ

అమలాపురం సైలెన్సర్ తీసివేసి రోడ్లపై అధిక శబ్దం చేస్తూ ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్న యువకులకు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. పేరూరు సెంటర్లో సైలెన్సర్లు తీసి హడావిడి చేసిన యువకుల వీడియోలు సోషల్ మీడియాలో‌ వైరల్ అయ్యాయి. పోలీసులు సైలెన్సర్లు తీసి తిరిగిన యువకులను గుర్తించారు. బైకులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మరోసారి చేస్తే కేసులు నమోదు చేస్తామని సిఐ వీరబాబు యువలకులను హెచ్చరించారు.

గౌడ అనే పదాన్ని ముందుగా వాడరాదు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం

అమలాపురం గౌడ అనే పదాన్ని ముందుగా వాడరాదని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ బిసి బి జాబితాలోకి గీత కులాలు సీరియల్ నెంబర్ ఫోర్ గా సవరించిన ప్రభుత్వం ఇకపై గీత కులాలకు జారీ చేసే కుల సర్టిఫికెట్లు సంబంధిత కులానికి మాత్రమే ప్రత్యేకంగా పేరు రాయాలి ఉదాహరణకు ఈడిగా, గౌడ, (గమల్లు) కళాలి గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశైయన, ఇలా మాత్రమే వ్రాయాలి గౌడ్ అనే పదాన్ని ముందుగా వాడరాదు అని ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది సంబంధిత సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి కుల ధ్రువపత్రాలు జారీ చేసేటప్పుడు అభ్యర్థి ఏ కులానికి చెందినవాడు అదే పేరు మాత్రమే వాడాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించిన నారా లోకేష్

అమలాపురం నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించడానికి ఎంతగానో కృషిచేసిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు అభినందనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి అపద వచ్చిన ప్రతి సందర్భంలో వారిని రక్షించడానికి మంత్రి నారా లోకేష్ ముందుంటారని మరోమారు ఈ సంఘటనతో రుజువైందన్నారు. నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంత్రి లోకేష్ స్పందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మంత్రి తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని మరీ సచివాలయంలోనే ఉండి రియల్టైం గవర్నెన్స్ సెంటర్...

సీఎం కి ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రా ఆటోవాలా కార్మికులు

అమలాపురం   12 13 తారీకుల్లో జరగబోయే ఆంధ్ర ఆటోవాలా యూనియన్ బంద్ వాయిదా  దసరా కానుకగా 15 వేల రూపాయలు ఆటో కార్మికుల అకౌంట్ లోకి జమ చేస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ కార్మికులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం భాగంగా స్త్రీ శక్తి పేరుతో పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు వాహన మిత్ర పథకం ద్వారా ఆటోడ్రైవర్లకు 15 వేల రూపాయలు ఆర్థిక...

చిందాడ గరువు రామాలయం సెంటర్ వినాయకుని ప్రసాదం దక్కించుకున్న రమేష్

అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం చిందాడ గరువు రామాలయం సెంటర్ లో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారిదగ్గర తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న స్వామివారి ఐదు కేజీల లడ్డు ప్రసాదం ను కాజా నాగేశ్వరరావు కుమారుడు రమేష్ వేలంపాటలో 61000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా వరసిద్ధివినాయక కమిటీ వారు రమేష్ ను శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం ను అందజేశారు. వేలం పాట లో స్వామి వారి లడ్డు తమకు దక్కడం అదృష్టం గా భవిస్తున్నామని కాజా నాగేశ్వరరావు మరియు వారికుమారుడు రమేష్ సంతోషం వ్యక్తం చేసారు.ఈ లడ్డు వేలంపాట కార్యక్రమం లో బొంతు...

12 13 తారీకుల్లో జిల్లాలో బంద్ కు పిలుపునిచ్చిన ఆంధ్రా ఆటోవాలా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు

అమలాపురం ఈ నెల 12,13 తేదీలలో ఆటో కార్మికులు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రా ఆటోవాలా జిల్లా ‌అధ్యక్షడు వాసంశెట్టి సత్తిరాజు మాట్లాడుతూ బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికల వాగ్ధానం ప్రకారం గడిచిన రెండు‌ సంవత్సరాలకు రూ.30వేలు ప్రతీ ఆటో కార్మికుని ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులతో ఆటోలను అనుసంధానం చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు.

చిట్టిల పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన మోసగాడు

ఐ పోలవరం మండలం చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారైన మోసగాడ అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మి డివరం నియోజకవర్గంలో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారయ్యాడు ఓ మాయగాడు.. వివరాల్లోకి వెళితే ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి చింతలపూడి వీర శంకర రావు(బుజ్జి) గత కొన్నే ళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ, స్దానికుల వద్ద నమ్మకం పెంచుకున్నాడు. అయితే ఇటీవల పాడుకున్న చిట్టీల తాలూకూ సొమ్ములు ఇవ్వకుండా సాకులు చెబుతూ హఠాత్తుగా గ్రామం నుండి అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు .ఈ ఘటనపై స్దానిక ఎమ్.ఎల్.ఎల్ దాట్ల సుబ్బరాజును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు ఎమ్. ఎల్.ఎ సూచనతో బాధితులు పోలీసులకు పిర్యాదు చేసారు.. బాధితుల ఫిర్యాదుతో కేసు...
✅ Message cleared
Left Ad
Right Ad
Logo