విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
విజయవాడ హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్ను మళ్లీ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాయగా, దానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా విజయవాడను తిరిగి హజ్ ఎంబార్కేషన్ పాయింట్గా గుర్తిస్తూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండపేట టీడీపీ ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై హజ్ యాత్రికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రం నుంచే యాత్ర ప్రారంభించవచ్చని తెలిపారు. ఇది ముస్లింలకు పెద్ద ఊరటగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ఈ...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
30వ వార్డు కౌన్సిలర్ మారిశెట్టి సత్యనారాయణ వైసీపీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత కట్టబెట్టిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మండపేట వైసీపీ ఇన్ చార్జి, పార్టీ సలహాదారుల కమిటి మెంబర్, రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా, తోట త్రిమూర్తులు మండపేట నుండి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పాటు పడతానని ఆయన స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గం...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మండపేట మండలం,జెడ్ మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.అధ్యక్షులుగా సలాది బాలసుబ్రమణ్యం, సభ్యులుగా సంగిశెట్టి అమ్మన్న, బోయిడి వెంకటరమణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ కూటమి నాయకులు, రైతులతో కలసి నూతన కమిటి సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట...
కౌన్సిలర్ మందపల్లి రవి...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, మండపేట
మండపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7,8 వార్డులలో సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, గోతులతో నిండిపోయాయని,సిసి రోడ్లు డ్రైనేజీల్లో ఒరిగిపోయాయి అని వెంటనే వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను 8 వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవి కోరారు. మండపేట టౌన్ పరిధిలో 30 వార్డులకు సీసీ రోడ్ల రిపేరు పనుల నిమిత్తం 17 లక్షలు శాంక్షన్ అయ్యి మూడు నెలలు గడిచిన నేటి వరకు ఈ రోడ్డు రిపేర్ పనులకు మోక్షం కలగలేదని అన్నారు. ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ప్రజలు ప్రతిరోజు తమ సమస్యల నిమిత్తం చాలామంది ఈ రోడ్ గుండా వెళ్తారని...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ చోడే శ్రీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.యువజన విభాగం ద్వారా చేస్తున్న కార్యక్రమాలు గూర్చి ఏపీ సబార్బినేట్ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివరించగా జగన్ ప్రత్యేకంగా అభినందించారని శ్రీకృష్ణ ఆనందం వ్యక్తంచేశారు. యువజన విభాగం బలోపేతానికి కృషిచేయాలని సూచించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్టు శ్రీకృష్ణ తెలిపారు.
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా మండపేట కు చెందిన ఎర్రగుంట మణికంఠ కుమార్ (అయ్యప్ప) నియమితులయ్యారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ,మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ , రాష్ట్ర సబర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఇచ్చిన ఈ బాధ్యతను 2029 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు...
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా...
జెఏసి సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
మండపేట ప్రజల ఆకాంక్ష మేరకు మండపేట ను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తను ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మండపేట లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం జెఏసి చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట టౌన్, మండలం విలీనం చేసేందుకు ఇక్కడి ప్రజలు వంద శాతం సుముఖంగా...
కార్యకర్తలతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల మండపేట వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల అభినందనలతో ముంచెత్తారు. శాసనసభ కమిటీలలో అత్యంత కీలకమైన సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఆయన నియామకం జిల్లా ప్రజలకు ఆనందదాయకమని కార్యకర్తలు అభిమానులు పేర్కొన్నారు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయనకు కీలక బాధ్యతల అప్పగించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తపరిచారు. సాలువాలతో పూలమాలలతో ఆయన్ని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వైసిపి పార్టీ కార్యాలయంలోకి ఆదివారం తోట రాగానే రంగు రంగు పుష్పాలు పూల...
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
మండపేట పట్టణంలో వేంచేసియున్న శ్రీ జనార్ధన శ్రీ అగస్త్యేశ్వర స్వామి వార్ల దేవస్ధానం (రధం గుడి) పునఃనిర్మాణ అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ రధం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి దేవాలయ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా స్లాబ్ లీకేజీలను అరికట్టడం, శిదిలావస్తుకు చేరిన వాటిని తొలగించడం, వాస్తు మార్పులను చేపడుతారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు రధం గుడికి ప్రతీ రోజు వచ్చే భక్తులతో నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించారు.ఈ...
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
జమాతె ఇస్లాం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా గత నెల రోజులుగా చేపట్టిన మట్టిలో చేతులు - హృదయంలో దేశం ఉద్యమం ఈ ఆదివారంతో ముగిసింది.ఈ ఉద్యమంలో భాగంగా పిల్లల్లో పర్యావరణ పై ఆవగాహన కొరకు వ్యాసరచన పోటిలతో పాటుగా డ్రాయింగ్ కార్యక్రమాలు మరియు విభిన్న ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని స్దానిక జమాతె మహిళా అధ్యక్షురాలు అయేషా తెలిపారు .ఈ సందర్భంగా సెంట్రల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ బాధ్యురాలు మొహతాబ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కనుక పిల్లల్లో ప్రత్యేకంగా పర్యావరణ పై ఆవగాహన కల్పించి చెట్ల పరిరక్షణ జరిగే విధంగా వారిని ప్రోత్సాహించాలని జమాతె దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని...