29 November 2025
Saturday, November 29, 2025

డొక్కా సీతమ్మ కాంటీన్‌లో అన్నదానం చేసిన జగ్గంపేట జనసేన నియోజక వర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ప్రతి మంగళవారం నిర్విరామ సేవా కార్యక్రమం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ కాంటీన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ మరియు జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు.జనసేన నాయకులు మాట్లాడుతూ, అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు డొక్కా సీతమ్మను ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నట్లే, తుమ్మలపల్లి రమేష్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గత ఎన్నికల అనంతరం నుండి ప్రతి మంగళవారం తన సొంత ఖర్చుతో నిరంతరం ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమళ్ళ నాగేశ్వరరావు, బుదిరెడ్డి శ్రీనివాస్, అంకం ఓం కృష్ణ, గంధం శ్రీను, ముత్యాల సుబ్బారాయుడు, మత్స తిరుపతి రాయుడు, చిరుత తాతజీ, యర్రా సాయి, సూరబతుల వీరబాబు, మండపాక శివ, అడబాల వీరబాబు, కాయల మణికంఠ, పాలెం బాబీ, కోలమూరి బుజ్జి, ఎలిగంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo