కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు జిల్లాలో పేకాట, బొమ్మ బొరుసు, క్రికెట్ బెట్టింగ్, ఎత్తులాట, కోత బంతి వంటి అన్ని రకాల జూదక్రీడలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ నిశ్చయించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు బలమైన నిఘా చేపట్టారు.
ఈ చర్యలో భాగంగా, జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు, జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు తన సిబ్బందితో కలిసి జగ్గంపేట మండలంలోని జే.కొత్తూరు శివారులో పేకాట ఆడుతున్న వారిపై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.11,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి, మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేకాట, ఇతర జూదక్రీడలపై కఠినంగా వ్యవహరించనున్నట్టు జగ్గంపేట సి ఐ వై అర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు. జగ్గంపేట మండలలో ఎవరైనా జూదక్రీడలకై వేదిక కల్పించినా వారి పైన చట్ట పరమైనా చర్యలు తప్పవని యస్ ఐ రఘనందనరావు తెలిపారు