కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక జెవిఆర్ అపార్ట్మెంట్ లో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబుని జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాలనీ టిడిపి శ్రేణులు మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జీను మణి బాబు మండల టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వంగా కలిశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మీరందరూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలిసి 1996లో పేదలకు జ్యోతుల నెహ్రూ కాలనీ ఏర్పాటుచేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని తరువాత కాలనీకి మళ్ళీ ఆయనే సిమెంట్ రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని గుర్తు చేసుకున్నారు. జీను మణి బాబు గారి సహకారంతో కాల్ నేను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడిశెట్టి కొండబాబు,అప్పికొండ నాగేశ్వరరావు, బురా తాతాజీ, గోళ్ళ చిట్టిబాబు, దేవరకొండ రమణ, బల్ల అప్పారావు, లోడగల రాంబాబు, చల్లా నాగేశ్వరరావు, ఏపూరి చిలకమ్మా, గోళ్ళ వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

