శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’తో ఘన విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్కి సైన్ చేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా AA22లో రష్మిక కీలక పాత్రలో కనిపించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణే ప్రధాన హీరోయిన్గా ఎంపిక అవడం, మిగతా క్యాస్టింగ్ మీద కూడా పాజిటివ్ బజ్ను కలిగించింది. తాజాగా రష్మిక మందన్నా పేరు కూడా ఫిక్స్ అయ్యిందనే న్యూస్తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.
‘పుష్ప’ సిరీస్లో బన్నీతో రష్మిక చూపిన కెమిస్ట్రీ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడు AA22లో మళ్లీ ఆ జోడీ రీ యూనియన్ అవుతుందని తెలిసి అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగింది. దీపిక, రష్మికతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోయిన్లను కూడా ఈ సినిమాలో తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ కాంబినేషన్లతో AA22 సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. బన్నీ కెరీర్లో ఇది మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా నిలవనుందనే మాట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి బన్నీ – రష్మిక కాంబినేషన్ మళ్లీ చూడబోతున్నామన్న వార్త అభిమానులకే కాకుండా, మొత్తం టాలీవుడ్కు గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు!