Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లపై నిఘాను పెంచడమేకాక, వారి పునరవాసానికి పోలీసు విభాగం నడుం కట్టింది. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. మరియు కిర్లంపూడి ఎస్‌ఐ ఎస్ ఐ గోలి సతీష్ పాల్గొన్నారు. జగ్గంపేట సిఐ వై ఆర్ కె మాట్లాడుతూ రౌడీషీటర్లు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం తీసుకుని ఇకపై సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఎవ్వరైనా మళ్లీ ఏవైనా గొడవలు, దౌర్జన్య ఘటనలు, సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే ఘటనల్లో పాల్గొంటే, వారి బెయిలు రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించే చర్యలు తీసుకుంటామని హితవు పలికారు.అలాగే ఎవరైనా నిజంగా మారి నిబద్ధతతో సామాజిక స్పూర్తితో జీవితం గడిపితే వారి మీద ఉన్న రౌడీషీట్లు పరిశీలించి తొలగించే అవకాశముందని అధికారుల మాట.ఈ కౌన్సిలింగ్‌లో పలువురు రౌడీషీటర్లు హాజరయ్యారు. వారిలో కొందరు తమ తప్పులను స్వీకరించి, ఇకపై చట్టాన్ని గౌరవిస్తూ జీవించనున్నట్లు హామీ ఇచ్చారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo