జగ్గంపేటలో 116 కేసులు పరిష్కారం — లోక్అదాలత్లో విశేష ఫలితాలు
కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై టి. రఘునాథరావు నిర్వహించిన కృషికి గుర్తింపు లభించింది.ఈనెల 5వ తేదీన నిర్వహించిన మెగా జాతీయ లోక్అదాలత్లో మొత్తం 116 కేసుల పరిష్కారానికి రఘునాథరావు ముఖ్య పాత్ర పోషించారు.కక్షిదారులు, ఫిర్యాదుదారులు, ఇరు వర్గాల వ్యక్తులను పరస్పర సమన్వయంతో కలిపి, సమాధానమార్గాలను సూచిస్తూ వారిని న్యాయపరంగా ఒప్పించి, కేసుల పరిష్కారానికి సహకరించడం ద్వారా జగ్గంపేట పోలీస్ స్టేషన్కు జిల్లాలో ప్రథమ స్థానం తెచ్చిపెట్టారు.ఈ ఘనతకు గుర్తింపుగా, శుక్రవారం (జూలై 25న) కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఎస్సై రఘునాథరావును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “జగ్గంపేట పోలీస్స్టేషన్ మాదిరిగానే, జిల్లా నలుమూలలా పోలీసులు ప్రజలతో మమేకమై సమస్యలు చక్కదిద్దే దిశగా కృషి చేయాలని” పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలోని ఇతర సిబ్బంది ఎస్ఐ రఘునాథరావుకు శుభాకాంక్షలు తెలిపారు.