Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

అధికారులు మానవత్వంతో సమస్యలు పరిష్కరించాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సామాజిక ఉద్యమకారుడు

పాటంశెట్టి సూర్యచంద్ర

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను మానవత్వంతో అందించాలంటూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి నెలకు ₹15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే, తాజాగా సంబంధిత అధికారులు అనేక నిబంధనలు చూపించి అర్హులను నిరాశకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు కలిసి సమస్యను వివరించిన పాటంశెట్టి సూర్యచంద్ర, 100% దివ్యాంగుడైన గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన ఇంజరపు రాంబాబు, మంచానికే పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు కోలా శివాజీ, బండారు వెంకటరమణల కోసం పింఛన్లను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.వారి పరిస్థితులను స్వయంగా సమీక్షించిన జాయింట్ కలెక్టర్ చినరాముడు, మానవీయ కోణంలో స్పందిస్తూ సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo