జగ్గంపేట సర్కిల్ పోలీసుల సరికొత్త చర్యలు
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జగ్గంపేట సర్కిల్ పోలీసు శాఖ విద్యార్థుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలలు మరియు కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి సంఘటనలు ఎదుర్కొనకుండా ఉండేందుకు తాజా టెక్నాలజీని వినియోగిస్తోంది.ఈ దిశగా, సర్కిల్ పరిధిలోని అన్ని పాఠశాలలు మరియు ప్రైవేట్ కళాశాలల వద్ద ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో డ్రోన్ల సహాయంతో నిఘా చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానితులను గుర్తించడం, విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థినులు భద్రతగా ఉన్నారని నమ్మకం కలుగజెయ్యడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.బుధవారం జగ్గంపేట మండలంలోని రాజపూడి హైస్కూల్ వద్ద డ్రోన్ కెమెరా ద్వారా పరిసర ప్రాంతాల్లో నిఘా నిర్వహించారు. డ్రోన్ పర్యవేక్షణతో పాటు పోలీసు బృందాలు కూడా పటిష్టమైన పెట్రోలింగ్ చేపట్టాయి. ఇది విద్యాసంస్థల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలలో ఒక భాగంగా చేపట్టారు.జగ్గంపేట సీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్యలతో విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగి, సమాజంలో మంచి సందేశం వెళ్లింది. ప్రజలు కూడా ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు.