స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నూతనంగా నియమితులైన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రామోజు నాగ వెంకట కామాచార్యులు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఈ పదవి రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీతో పని చేసే అడ్వకేట్ కామాచార్యులు ను ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ పదవి ఇచ్చిందని ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా ఆయన పని చేస్తారని ఆయన ఆధీనంలో ఐదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, నాలుగు కార్పొరేషన్ లు, 25 మున్సిపాలిటీలు, 1400 గ్రామపంచాయతీలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం రిటైర్డ్ పిఆర్ఓ తులా రాము పాల్గొన్నారు.