Wednesday, August 6, 2025
Wednesday, August 6, 2025

ఏపియుడబ్ల్యూజె ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపియుడబ్ల్యూజె) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో జర్నలిస్టులు భారీగా నిరసన తెలిపారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే గా ఆగస్టు 5న పాటించాలని యూనియన్ కోరిన నేపథ్యంలో, జగ్గంపేట మరియు గండేపల్లి నియోజకవర్గాలకు చెందిన ఏపియుడబ్ల్యూజె సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించగా, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు స్వీకరించారు.పత్రికా స్వేచ్ఛకు పరిరక్షణ కల్పించాలి, జర్నలిస్టులకు రక్షణ చట్టం అమలు చేయాలి, పత్రికా ఉద్యోగులకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, గృహ నివాసాలు, పెన్షన్ వంటివి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి చిక్కాల మణికంఠ, పూర్వపు జిల్లా ట్రెజరర్ బాబులు, జిల్లా నాయకులు సుంకర శ్రీనివాస్, రాయుడు సూర్యప్రకాశరావు, నియోజకవర్గ నాయకులు కాపవరపు భాస్కరరావు, గండేపల్లి కార్యదర్శి నేదూరి శ్రీధర్, జగ్గంపేట మండల సభ్యులు వి.ఎస్.ఎన్. మూర్తి, వెంపాటి రామారావు, రిషిరామ్, మధు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo