కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన కానూరీ గంగాధర్ (కాసులు) ను జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియమించారు. ఈ సందర్భంగా కాసులు మాట్లాడుతూ నాపై నమ్మకంతో కిర్లంపూడి మండలం కార్మిక విభాగం అధ్యక్షులుగా నిర్మించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి, మండల అధ్యక్షులు వీరం రెడ్డి కాశి బాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మండలంలో కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి ఎమ్మెల్యే నెహ్రూ, నవీన సహకారంతో కృషి చేస్తానని అన్నారు. కాసులకు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.