ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలసి ఆశీస్సులు తీసుకున్న టిడిపి మండల ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా జగపతినగరం గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీమన్నారాయణ ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియమించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కిర్లంపూడి మండల పార్టీ ఉపాధ్యక్షుడుగా నియమించినందుకు వారి హృదయపూర్వకకృతజ్ఞతలు తెలియజేయడానికి విచ్చేసానని వారిని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ మండల అధ్యక్షులు వీరం రెడ్డి కాశిబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయడం జరుగుతుందన్న అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, కిర్లంపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్, కాళ్ల వెంకటేష్, హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ళ బాబులు, జగపతినగరం ఎంపీటీసీ సభ్యులుఆళ్ల వెంకటరమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.