కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామదేవత మంట్లమ్మ నూతన ఆలయ నిర్మాణం కొరకు ఆదివారం ఉదయం 10 గంటలకు కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి, జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, బోధి రెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ హాజరై శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షులు వీరం రెడ్డి కాశి బాబు, వీరవరం సొసైటీ అధ్యక్షులు తోట గాంధీ, తెలుగు యువత అధికార ప్రతినిధి బోదిరెడ్ల సుబ్బారావు, క్లస్టర్ ఇంచార్జి పాఠం శెట్టి మురళీకృష్ణ, కిర్లంపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్, పాఠం శెట్టి రవి, మంచి కంటి శ్రీను, బొడ్డేటి సుమన్, సూరిశెట్టి వెంకట శివ, నక్కనదుర్గారావు, యడాలి రాంబాబు, భవనగిరి కాశీ విశ్వనాథ్, చెన్నం శెట్టి అర్జున్ రావు అధిక సంఖ్యలో కృష్ణవరం ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

