Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

గంజాయి తరలింపు విఫలం.. 4.38 కేజీల గంజాయి తో ఒక వ్యక్తి అరెస్ట్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్( ఐపీఎస్ )ఆదేశాలపై ఉక్కుపాదం మోపిన జగ్గంపేట పోలీసుల బృందం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లాలో గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్న జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జగ్గంపేట పోలీసులు ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరి రాజు పర్యవేక్షణలో కీలక ఆపరేషన్‌ చేపట్టారు.జగ్గంపేట నుండి కాకినాడ వెళ్లే ప్రధాన రహదారిలోని కాట్రావులపల్లి గ్రామ సమీపంలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద, స్థానిక పోలీసు బృందం అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతను జగ్గంపేట మండలానికి చెందిన కే. లోవ రాజు అలియాస్ రాజేష్ అలియాస్ పటేల్ (37), మెరక వీధికి చెందినవాడిగా గుర్తించారు.సందేహంతో అతని వద్ద తనిఖీలు జరపగా 4.38 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తును జగ్గంపేట సీఐ వై.ఆర్.కే ఆధ్వర్యంలో ఎస్సై రఘునందన్ రావు మరియు సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.నిందితుడిని అరెస్ట్ చేసి, పెద్దాపురం గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచగా, ఆగస్టు 14 -2025 వరకు న్యాయ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని సమూలం చేయాలనే లక్ష్యంతో నిరంతరంగా చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo