జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
ఈ నెల 27వ తేదీన ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో జగ్గంపేట ,కిర్లంపూడి ,గండేపల్లి మండల గ్రామాల్లో గణేశ్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ సూచించారు.ఆదివారం నిర్వహించిన విలేకరులతో సమావేశం లో ఆయన మాట్లాడుతూ గణేశ్ మండపాల ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతులు పొందాలని చెప్పారు. అనుమతులు పొందడంలో ఎటువంటి చలానాలు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. https://ganeshutsav.net లోకి వెళ్లి ఎంట్రీ చేసి, అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.నాలుగు అడుగులకంటే పెద్ద విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి,మండపాలు రోడ్డు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలి. రాత్రివేళ ముగ్గురు వాలంటీర్లు కాపలా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జూదం, మత్తు పదార్థాలు, అశ్లీల నృత్యాలు నిషేధం. ఊరేగింపులు నిర్ణీత రూట్లో, నిర్ణీత సమయాల్లో శాంతియుతంగా జరగాలి. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడరాదు.నిమజ్జనం నిర్ణీత ప్రాంతంలోనే జరగాలని, నీటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ఉత్సవాలు క్రమశిక్షణ, సామరస్యం, భక్తి భావంతో జరగాలని సీఐ వై.ఆర్.కె. సూచించారు.