ప్రిన్సపాల్ లలిత కుమారి
జగ్గంపేట లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు వివిధ తరగతులకు సంబంధించి సీట్లు ఉన్నాయని వాటికి ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానం పలికినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5వ తరగతిలో ఎస్సీ 28 , బిసి సి 10, ఎస్టీ 03 సీట్లు ఉన్నాయని , 10 వ తరగతి లో బీసీ 2 , ఎస్ టి 1 , ఎస్సీ 10 సీట్లు ఉన్నాయని అదే విధంగా కళాశాలకు సంబంధించి ఎంపీసీ ఎస్సీ 04 , ఎస్టి 03 సీట్లు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ సోమవారం ఉదయం కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకనున్నట్లు ఆమె తెలిపారు.