కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు–ఉప్పలపాడు రోడ్డులో, ఉప్పలపాడు గ్రామంలో నాలుగు పాడి గేదెల దొంగతనానికి పాల్పడిన నలుగురు ముద్దాయిలను గండేపల్లి ఎస్.ఐ. శివ నాగబాబు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.అశ్వరావుపేటకు చెందిన ఈ. చరణ్ (21), ఎన్.ఎన్. తిరుపతి (20), వి.ఆర్. కుమార్ (29), బి. వీరేంద్ర (19)లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగిలించిన నాలుగు పాడి గేదెలు (విలువ సుమారు రూ.1,60,000), ఒక బడా దోస్త్ వాహనం, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ వెల్లడించారు.