కాకినాడ జిల్లా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి మణిమ్మ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇర్రిపాక ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, తదితరులు జ్యోతుల మణిమ్మ ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి ఆశీస్సులు తీసుకున్నారు. కోడలు జ్యోతుల లక్ష్మీదేవి, మనవడు జ్యోతుల అనీష్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గానికి అన్నపూర్ణేశ్వరిగా పేరు సంపాదించుకుని ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళండి అంటూ పలకరించే మా అందరి అమ్మ జ్యోతుల మణిమ్మ పుట్టినరోజు సందర్భంగా మా అందరికీ పండగ దినంగా ఉందని ఆమె ఆధ్వర్యంలో ఇర్రిపాకను ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించి నిత్యం శివకేశ్వర పూజించుకునే వీరి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నిండు నూరేళ్లు హాయ్ ఆరోగ్యాలతో మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, వెలిశెట్టి బుజ్జి, వేములకొండ జోగారావు, పీలా మహేష్, నండ్ల చిరంజీవి, నేదురి గణేష్, పలివెల యేసు రాజు, వైభోగల శ్రీను, వాకా గోవింద్ రెడ్డి, ముక్క పాలు బాబు, కొఠారి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.