మహిళల రక్షణపై జగ్గంపేట పోలీసుల హామీ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ సూచనలతో, మహిళల భద్రతకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, విద్యార్థినీల హాస్టళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా పరికల్పనలతో పాటు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిలుగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె, ఎస్ఐ రఘునందన్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా సీఐ వై.ఆర్.కె మాట్లాడుతూ –హాస్టల్లో విద్యార్థినీల మధ్య ర్యాగింగ్ వంటి అనవసరమైన ఘటనలు చోటు చేసుకోకుండా అందరూ సోదరీ భావంతో ఉండాలి. కొత్తగా చేరిన విద్యార్థినీలను బంధువుల్లా చూసుకోవాలి. ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా, నిబద్ధతతో చదువుకోవడానికి అవసరమైన రక్షణను పోలీసులు నిరంతరం కల్పిస్తారు” అని చెప్పారు.పోలీసులు 24 గంటలు విద్యార్థినీలకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 9440796529, 9440796569 నెంబర్లకు గానీ, 100 నెంబర్కు గానీ సంప్రదించాలని సూచించారు.అంతేకాక, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ రక్షణ అందించే ‘శక్తి’ మొబైల్ యాప్ ఉపయోగాలపై విద్యార్థినీలకు వివరించారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, అత్యవసర సమయంలో ఉపయోగించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం విద్యార్థినీలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, వారి భద్రతపై పోలీసుల వంతైన బాధ్యతను స్పష్టంగా చూపించిందని తెలుస్తుంది. ఈ కార్యక్రమం ల్ పాఠశాల ప్రిన్సిపాల్ డా. జి.వి. లలిత కుమారి, వైస్ ప్రిన్సిపాల్ బివిసి కుమారి,ఉపాధ్యాయులు రజిని, అమృతవల్లి, ఉషారాణి, సత్యవతి, తులసి, సూర్యావతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.