కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లోని చున్ని జామియా మసీదులో నూతనంగా జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జీను మణి బాబును మసీదు గౌరవాధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ గఫూర్ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పూలమాలలో సాల్వలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జీను మణి బాబు మాట్లాడుతూ దేశానికి స్వతంత్ర సిద్ధించిన రోజున ముస్లిం పెద్దలు నన్ను గౌరవించి ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా ఉందని ముస్లిం సోదరులు సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి తెలియజేసి పరిష్కరిస్తానని ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, కొత్త ప్రసాద్, పిలా మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ వల్లి, నండ్ల చిరంజీవి మసీదు కమిటీ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు.