ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహించిన సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ జూడో చాంపియన్షిప్లో కాకినాడ జిల్లా జగ్గంపేట భాష్యం స్కూల్ కి చెందిన బత్తుల తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి, జాతీయస్థాయికి అయ్యారని ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి సత్యనారాయణ తెలియజేశారు. సెప్టెంబర్ 8వ తేదీన హర్యానాలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారు తేజస్విని సత్కరించి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వాణి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికైన జగ్గంపేట భాష్యం విద్యార్థిని

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట
రచయిత నుండి మరిన్ని
సంబంధిత వార్తలు
