స్థానిక జేవియర్ అపార్ట్మెంట్ వద్ద జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన జీను మణి బాబును గోవిందపురం గ్రామ సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ మనందరి అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం సహాయ సహకారాలు అందిస్తూ నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ నాయకత్వంలో మన గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించుకుందామని ఎవరికైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినట్టయితే వారికి అందే విధంగా ప్రభుత్వం అధికారుల ద్వారా ప్రజలకు పనిచేసే పెడదామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మిల దుర్గాప్రసాద్, కొల్లు రామకృష్ణ, పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు.