నలుగురి వద్ద నుంచి రూ.10,250 నగదు స్వాధీనం
జూదక్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జగ్గంపేట సి ఐ వై ఆర్ కె హెచ్చరిక
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు జిల్లాలో జూదక్రీడలు, క్రికెట్ బెట్టింగులు, బొమ్మా బొరుసు, కోతా బంతి, ఎత్తు లాట వంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఆ దిశగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ సూచనలతో ఎస్సై రఘునందన్ రావు సిబ్బందితో కలిసి ఆదివారం జగ్గంపేట మండలం జే.కొత్తూరు గ్రామ శివారులో పేకాట దందాపై దాడి చేశారు.ఈ దాడిలో నలుగురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకున్నారు .వారి వద్ద నుండి రూ.10,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.జూదం, కోడిపందాలు, గుండాటలు, క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్ వంటి అక్రమ క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు.