9 మందికి రూ.90 వేలు జరిమానా
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ (ఐపీఎస్ )ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కిర్లంపూడి పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, త్రాగి వాహనాలు నడుపుతున్న తొమ్మిది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈరోజు సంబంధిత తొమ్మిది మందిని గౌరవ పత్తిపాడు కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం గౌరవ న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.90,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ త్రాగి వాహనం నడిపితే ప్రాణహాని సంభవిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.ప్రజల భద్రత కోసమే పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.