Monday, August 4, 2025
Monday, August 4, 2025

పనిచేయని ఫోన్లు మాకొద్దు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఐసీడీఎస్ సిబ్బంది ఆందోళన

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

 

కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాజెక్ట్ పరిధిలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల అంగన్వాడీ సిబ్బంది సోమవారం ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకొని పనిచేయని ఫోన్లు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. 2022లో అందించిన 2జీ స్మార్ట్‌ఫోన్లు పనిచేయకపోవడంతో, అవి ఉపయోగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.ఫోన్‌లలో యాప్‌లు పని చేయడం లేదని, గర్భిణీలు, బాలింతల వివరాలు నమోదు చేయడంలో సమయం తలెత్తుతోందన్నారు. ఫేస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ గంటల తరబడి సమయం పడుతోందని విన్నవించారు. 5జీ ట్యాబ్‌లు అందిస్తే తాము సమర్థంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రాజెక్టు పరిధి అధ్యక్షురాలు సిహెచ్. రత్నం, కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo