Friday, August 1, 2025
Friday, August 1, 2025

ప్రజాదర్బార్ లో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేటనియోజకవర్గంలోని ప్రజల ప్రతి సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు హాజరై వినతి పత్రాలను ఎమ్మెల్యేకు సమర్పించారు. తమ సమస్యల పరిష్కరించమని కోరారు. ఎమ్మెల్యే తక్షణమే సంబంధిత అధికారులకు సమస్య తెలిపి సత్వరమే సక్రమ పరిష్కారం ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగామల్లేపల్లి లో తురాయి చెట్టు వద్ద నుంచి వేలిది వారి కాలవ వరకు రోడ్డు అద్వాన పరిస్థితుల్లో ఉండడంతో తక్షణమే రోడ్డు వేయించాలని మల్లేపల్లి రైతులతో కలిసి జనసేన జిల్లా కోఆర్డినేటర్ రామకుర్తి నరసింహం ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేయగా ఆ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల అవసరాలపై ప్రజలు ప్రజా దర్బార్లో తెలియచేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా వంటి ప్రజా అవసరాలపై ప్రజా దర్బార్లో తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమం మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, గోకాడ రాంబాబు, భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ చైర్మన్ గల్లా రామచంద్ర రావు, కాళ్ల వెంకటేష్, నాగం వెంకటపతి, ఆయిల్ స్వామి, బిట్ర ప్రభాకర్ రావు, రామకుర్తి నాగేశ్వరరావు, నంద్యాల గోపాలం తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo