ఇర్రిపాకలో విద్యార్థులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణి
ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి అన్నారు.శుక్రవారం ఆమె జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డిస్తూ, భోజన నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యం స్టాక్, వంటకు ఉపయోగించే పదార్థాలు, వంటగది పరిశుభ్రతపై సమగ్రంగా విచారణ జరిపారు.విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు లేదా ఇతర అనారోగ్యకర అంశాలు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. తరగతి గదులను పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం పిల్లలకు అందుతున్న వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో, విద్యార్థులకు అందుతున్న వసతులను సమీక్షించేందుకు ఈ పాఠశాల సందర్శించాను అని ఆమె తెలిపారు.