14 October 2025
Tuesday, October 14, 2025

భవిత కేంద్రం దివ్యాంగులు స్కూలుకు ప్రింటర్ బహుకరించిన ఇంజరపు దుర్గ బాబు మేరీ దంపతులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

దివ్యాంగుల మధ్య పెళ్లిరోజు జరుపుకుని వారికి అన్నదానం నిర్వహించారు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఇంజరపు దుర్గ బాబు మేరీ దంపతులు ప్రతి సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గత సంవత్సరం తాళ్లూరు జి య్యాన్న ఆలయానికి 25 వేల రూపాయల ఇన్వెర్టర్ బహుకరించారు. తర్వాత సౌండ్ సిస్టం బహుకరించారు. ఈ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా జగ్గంపేట భవిత కేంద్రంలోని దివ్యాంగుల స్కూల్ కు 13000 రూపాయల ప్రింటర్ బహుకరించారు. అనంతరం దివ్యాంగుల కు భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా దుర్గ బాబు మాట్లాడుతూ ముందుగా మా ఇష్టదైవం తాళ్లూరు వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నామని ప్రతి పెళ్లి రోజుకు మా దంపతులం ఆర్భాటాలకు పోకుండా ఏదో సేవా కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ సిబ్బంది అప్పాల పెద్దకాపు, చినబాబు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo