మండపేట ముస్లిం జె ఏ సి కన్వీనర్ గా సయ్యద్ ఇబ్రాహీం ఎన్నికైనట్లుగా ముస్లిం జె ఏ సి సభ్యులు,మండపేట జమియా మస్జిద్ అధ్యక్షులు ఎండి అతావుర్ రెహమాన్(రాయల్ అల్తాఫ్) తెలియజేశారు…
జె ఏ సి పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు…
మండపేట ముస్లిం జె ఏ సి కన్వీనర్ గా సయ్యద్ ఇబ్రాహీం ఎన్నికైనట్లుగా ముస్లిం జె ఏ సి సభ్యులు,మండపేట జమియా మస్జిద్ అధ్యక్షులు ఎండి అతావుర్ రెహమాన్(రాయల్ అల్తాఫ్) తెలియజేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పట్టణంలోని మజిద్ కమీటి అధ్యక్షులు జె ఏ సి సభ్యులందరు కలసి సయ్యద్ ఇబ్రాహీం ను కన్వీనర్గా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ సయ్యద్ ఇబ్రాహీం మాట్లాడుతూ మండపేట ముస్లిం జె ఏ సి కన్వీనర్గా ఎంపిక చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. జె ఏ సి పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ అల్ ఆమీన్ మస్జిద్ అధ్యక్షులు ఎండి రహీం, విజయలక్ష్మి నగర్ అక్సా మస్జిద్ అధ్యక్షులు షేక్ మౌలాలీ, సైదల్లి పేట హమ్జా మస్జిద్ అధ్యక్షులు ఎండి అర్షి,జమాఅతె ఇస్లామీ అధ్యక్షులు ఫారుఖ్ అలీ, ఏ పి జె చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ షేక్ మౌలానా, మండపేట జామియా మస్జిద్ కమిటీ కార్యదర్శి ఎండి కరీం ఖాదరి, జె ఏ సి సభ్యులు, జిల్లా నూర్ బాషా సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రాహీం,షేక్ గౌస్,చిన బాదుల్లా,మెకానిక్ కరీం,వహీద్,అబ్దుల్ హమీద్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.