స్థానిక జీవీఆర్ అపార్ట్మెంట్ లో జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబునుజగ్గంపేట శ్రీ శిరిడి సాయి టైలర్స్ యూనియన్ అధ్యక్షులు కింతాడ వెంకటరమణ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ టైలర్ అసోసియేషన్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అసోసియేషన్ భవనం నిర్మించారని దానికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. టైలర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇల్లు లేని టైలర్స్ కు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ సహకారంతో ఏర్పాటు చేయించాలని జీను మణి బాబును కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సింగవరపు శ్రీనివాస్ (t4 టైలర్) సెక్రెటరీ కేసు బోయిన నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ నీలపల్లి వాసు, గౌరవ అధ్యక్షులు వాకా నాగిరెడ్డి, బొడ్డు కొండ శ్రీను జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఆది మూలం ప్రసాద్, తుమ్మల కిషోర్, జీలం అప్పారావు, సుధా కృష్ణ, కాము సురేష్, ఏ కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

