కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరి గ్రామానికి చెందిన ఒక అవివాహిత యువతి ఆగస్టు 1 వ తేదీన మిస్సింగ్ అయిన ఘటనపై గండేపల్లి పోలీస్స్టేషన్లో 249/2025 U/s ఉమెన్ మిస్సింగ్గా కేసు నమోదు చేయబడింది. ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్న జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఎస్ఐ శివ నాగబాబు, వారి సిబ్బందితో కలిసి అనేక కోణాలలో విచారణ చేపట్టి, ఆమెను హైదరాబాద్లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి ట్రేస్ చేశారు.అదే క్రమంలో గండేపల్లి పోలీసు బృందం ఆ యువతిని అక్కడి నుండి తీసుకొచ్చి, పోలీసు ల పర్యవేక్షణలో బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్ )ఆదేశాలు మేరకు మహిళలు మరియు బాలికల మిస్సింగ్ కేసులపై అత్యంత ప్రాధాన్యతతో స్పందిస్తూ, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెంటనే ట్రేస్ చేశాం అని ఆయన తెలిపారు