Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

మిస్సింగ్ మహిళను ట్రేస్ చేసిన గండేపల్లి పోలీసులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ మిస్సింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటువంటి ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ చేసి బాధితులను సురక్షితంగా గుర్తించి, బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు నిర్దేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల వివాహిత భర్త వద్దకు వెళ్లడానికి నిరాకరించి, కుటుంబ సభ్యులకు తెలియకుండా మిస్సింగ్ అయిన ఘటనపై గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో సి అర్ నెంబర్ 114/2025 యూ /స్ ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు అయింది.ఈ కేసును అధిక ప్రాధాన్యతతో తీసుకున్న గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు మరియు ఆయన పోలీసు బృందం వివిధ టీమ్ లు గా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టి, తగిన ఆధారాలను సేకరించారు. చివరకు పక్కా సమాచారం ఆధారంగా ఆమెను నెల్లూరు పట్టణంలో గుర్తించి, అక్కడికి వెళ్లి సురక్షితంగా పోలీసులు ఆమెను పట్టుకుని గండేపల్లికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె తల్లికి అధికారికంగా అప్పగింపు చేశారు.ఈ విజయవంతమైన చర్యకు గాను జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ మరియు గండేపల్లి పోలీస్ బృందానికి ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్ పి మార్గదర్శకంలో మిస్సింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo