గ్రామ ప్రజల ఘన సత్కారం
గండేపల్లి మండలంలోని యల్లమిల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడిగా సీనియర్ టిడిపి నాయకుడు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (యల్లమిల్లి సీఎం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని టిడిపి కార్యకర్తలు, స్థానికులు సాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భం గా యల్లమిల్లి వీర వెంకట సత్య నారాయణ మట్లాడుతూ, “ఈ బాధ్యతను నాలో ఉంచిన నమ్మకానికి నెరవేర్చే విధంగా పనిచేస్తాను. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, పార్టీకి తీసుకెళ్లే వారధిగా ఉండటమే నా కర్తవ్యం” అని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దిపూడి వీర వెంకట సత్యనారాయణ, మాదిరెడ్డి కృష్ణార్జున, దేవిశెట్టి బాబ్జి, గండేపల్లి మండల టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు చీకట్ల నాగరాజు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.