రాజకీయ పక్షాల సమావేశం…
మండపేట లో శనివారం సాయంత్రం తహశీల్దార్ వారి కార్యాలయం, మండపేట నందు నెం.48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గం ఓటరు నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్, కె.ఆర్.ఆర్.సి. పి.కృష్ణమూర్తి అందరు జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల దరఖాస్తులు ఫారం-6, 7 మరియు 8 లకు సంబంధించిన స్టేటస్ వివరములు, బూత్ లెవెల్ అధికారుల జాతీయ శిక్షణా కార్యక్రమం షెడ్యూల్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ప్రతిపాదనలు మరియు ఎన్నికల విభాగమునకు సంబంధించిన ఇతర విషయములు చర్చించియున్నారు. సదరు సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఉంగరాల రాంబాబు, బి.జె.పి పార్టీ వి.దుర్గా ప్రసాద్ మరియు రమణ, వైస్సార్సీపీ పార్టీ యరమాటి వెంకన్నబాబు, జనసేన పార్టీ నామాల చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ ఎం.జె. రాజ్ బాబ్ లు హాజరు అయినారు. ఉంగరాల రాంబాబు మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ స్టేషన్ లో ఓటర్లు సంఖ్య 1000 కంటే తక్కువ ఉండే విధంగాను, బి.జె.పి. పార్టీ నుండి టిడ్కో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ వారి ఓట్లు వేరు వేరు పోలింగ్ స్టేషన్ లలో నమోదు అయినవి కనుక ఓట్లు నివాసం ఉన్న ప్రదేశంలో గల పోలింగ్ స్టేషన్ నకు ఓటు బదిలీ చేయవ లెననియు, వైసీపీ యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ ఈవీఎం మిషన్ ద్వారా ఓటు వేసిన తదుపరి వివిపేడ్ లోకి వచ్చే స్లిప్ నీ ఓటరు చేతికి అందించే విధంగా ఏర్పాటుచేస్తే ఆ స్లిప్ నీ పోలింగ్ బూత్ ప్రక్కన డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తే ఆ బాక్స్ వేసే విధంగా తగిన చర్యలు తీసుకొనవలసినదిగాను కోరియున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహశీల్దార్, మండపేట శ్రీ పి. తేజేశ్వర రావు, డిప్యూటీ తహశీల్దార్, కపిలేశ్వరపురం శ్రీ కె.జానకి రామయ్య, మునిసిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ శ్రీ జి.శ్రీనివాస రావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ శ్రీ పి.ఎ. మెహర్ బాబా, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ ఎం. శ్రీనివాస రావు, ఎన్నికల ఆపరేటర్లు పాల్గొన్నారు.