Monday, August 4, 2025
Monday, August 4, 2025

రామచంద్రపురంలో 18 శక్తి పీఠాల ప్రతిష్ఠాపన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

దుర్గమ్మ తల్లి ఆలయంలో వైభవంగా చండీహోమం, గణపతి హోమం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన రామచంద్రపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 18 శక్తి పీఠాల ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయిగుణశేఖర్ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులోని వనదుర్గ అమ్మవారి ప్రాంగణంలో, మహా చండీ హోమం, గణపతి హోమం సహా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు ప్రసాద్, వైస్ సర్పంచ్ రేవూరి శ్రీను, మాజీ ఎంపీటీసీ సతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పైలా దత్తయ్య, పొడుగు నరసింహం, పైలా గోవింద్, పసుపులేటి గొల్లయ్య, గంధం వెంకన్న, కొలమూరి బుజ్జి, గంధం శివ లు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించారు.భక్తి క్షేత్రమైన ఈ ఆలయానికి సుమారు ఐదు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo