Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

రైతులు వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలు అందిపుచ్చుకోవాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఆధునిక యంత్రాలతో వ్యవసాయం లాభసాటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ లో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామ కిసాన్ డ్రోన్ సిహెచ్ సి రైతు గ్రూపుకు డ్రోన్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీలో వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించడానికి వ్యవసాయ డ్రోన్ పరికరాలను వినియోగించేలా సబ్సిడీపై వాటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందనివాటితో అన్నదాతలు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే ఖర్చులు ఆదా అవుతాయని, సేద్యం లాభసాటిగా మారుతుందని ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాల వారీగా పరిమితంగా రైతు గ్రూపులకు డ్రోన్లు అందిస్తుందని అందులో భాగంగా ఈరోజు మల్లేపల్లి గ్రామానికి చెందినశ్రీరామ కిసాన్ సిహెచ్ సి రైతు గ్రూపు అందించామని అన్నదాతలనుప్రోత్సహించడానికి రాష్ట్రానికి 875 యూనిట్లు మంజూరు చేసింది. ఐదుగురు రైతుల గ్రూపును లబ్ధిదారులుగా గుర్తించింది. జిల్లాల వారీగా ఎంపిక పూర్తి చేసి వ్యవసాయ శాఖతో వారికి శిక్షణ ఇప్పించింది. ఈ డ్రోన్లు అందిస్తున్నామని రూ.8 లక్షల రాయితీతో ఒక్కో యూనిట్‌ ధర రూ.9.80 లక్షలు ఇందులో రైతుల వాటా రూ.1.80 లక్షలు మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల వాటాను బ్యాంకుల ద్వారా రుణమిప్పించి డ్రోన్‌ కంపెనీలకు చెల్లించేలా చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడి శ్రీనివాస్, మండల అధికారి రెడ్ల శ్రీరామ్ మాట్లాడుతూ గండేపల్లి మండలంలో ఇప్పటికే రెండు డ్రోన్లు అందించామని ఇంకా 3 అందుబాటులోకి వస్తున్నాయని ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ లక్ష్మణరావు, పో తుల మోహనరావు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, కాటేపల్లి భద్రరావు, కొల్లు త్రిమూర్తులు, మురళి రాజు, బద్ది సురేష్, శ్రీరామ కిసాన్ లోన్ సిహెచ్ గ్రూప్ కన్వీనర్ డి పార్వతి, కో కన్వీనర్ వి సుహాసిని, గ్రూప్ సభ్యులు డి రత్న భద్రం, కే భద్ర రావు, డి భద్రరావు, డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo