01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

సత్య సాయి బాబా డ్రింకింగ్ వాటర్ కార్మికుల సమస్యలపై, అధికారులు, కార్మికులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట సత్య సాయి బాబా డ్రింకింగ్ వాటర్ కార్మికులు గత 20 నెలలుగా జీతాలు లేక నిరవధిక సమ్మె చేయడంతో జగ్గంపేట నియోజకవర్గం లోని గోకవరం మండలం, రాజనగరం నియోజకవర్గం లోని కోరుకొండ, రాజానగరం మండలాలకు త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి రావడంతో సోమవారం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జిల్లా పరిషత్ సీఈవో, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డి ఈ, జేఈ, కాంట్రాక్టర్, కార్మికులతో కలిసి సమావేశం నిర్వహించారు. కార్మికులకు తక్షణం 50 శాతం జీతాలు చెల్లించాలని వెంటనే విధుల్లోకి తీసుకుని ఈ రోజు నుండి సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించి సమస్యను పరిష్కరించారు. గత కొద్దికాలంగా త్రాగునీరు లేక ఇబ్బంది గురవుతున్న గోకవరం, కోరుకొండ, రాజానగరం ప్రజలు సమస్య పరిష్కారమైందని తెలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంట్రాక్టర్, సత్య సాయి బాబా డ్రింకింగ్ వాటర్ కార్మికులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo